Bigboss Season7: ఇక లొల్లి లో శోభా శెట్టి వంతు!

Bigboss Season7:

బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుండి మొదటి వారం పెద్దగా ఇంట్రెస్టింగ్ గా సాగకపోయినా, రెండో వారం నుండి మాత్రం ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఆ వారం లో పల్లవి ప్రశాంత్ పై అందరూ ఫైర్ అవగా, రెండో వారం చివర్లో రతిక పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైర్ అయ్యారు. ఇక ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కొక్కొరు తమ ఒరిజినాలిటీ ని బయట పెట్టేసారు. మొన్న యావర్ గౌతమ్ తో గొడవ పడగా, నిన్న రతిక ప్రశాంత్ తో వాగ్వాదానికి దిగింది. ప్రశాంత్ తోనే గాక, దామిని, గౌతమ్ తో కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా శోభా శెట్టి కూడా బిగ్ బాస్ లో చిల్లర లొల్లి స్టార్ట్ చేసింది. ఈ సీజన్లో అప్పుడప్పుడు పలువురు కంటెస్టెంట్స్ తో వాగ్వాదానికి దిగే శోభా, ఈ సారి గౌతమ్ తో గట్టిగానే గొడవకి దిగింది. అసలు విషయమేంటో తెలియదు గాని, గొంతు పోయేలా అరిచింది. ఆ తర్వాత గౌతమ్ డంబుల్స్ తీసి ఎక్సెర్సయిస్ చేస్తూ తాను కూడా అరుస్తున్నాడు. ఇదంతా ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోలో తెలిసింది. అయితే గొడవ మొదలవడానికి డంబుల్స్ కారణం కావచ్చు.

ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 7 ఈ గొడవలతో మరింత ఆసక్తి గా మారుతుంది. అయితే బిగ్ బాస్ మూడో వారంలో గౌతమ్, శోభా శెట్టి ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చని వోటింగ్స్ ని బట్టి అనిపిస్తుంది. మొన్నటి వరకు యావర్ లిస్ట్ లో ఉన్నప్పటికీ తన ఆటతో ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు