Sankranti : ఫస్ట్ డే విన్నర్ ఎవరంటే ?

సాధారణంగా సంక్రాంతి అంటేనే పండగ హడావుడి ఉంటుంది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య సినిమాలు సంక్రాంతికి ఉంటే.. అది వేరే లెవెల్ హడావుడి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అలాంటి పరిస్థితే ఉంది. వీర సింహా రెడ్డితో బాలయ్య, వాల్తేరు వీరయ్యతో చిరంజీవి ఈ సంక్రాంతి పోటీలో ఉన్నారు. వీరితో పాటు తెగింపుతో అజిత్, వారసుడుతో విజయ్ కూడా సంక్రాంతికి సై అంటూ వచ్చారు. ఈ పోటోలో ఎవరు గెలుస్తారు ?.. సంక్రాంతి విన్నర్ ఎవరు ? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ రన్ అయితే గానీ, విన్నర్ ఎవరు అనేది చెప్పలేం. కానీ, వేరు వేరు రోజుల్లో రిలీజ్ అయిన ఈ నాలుగు సినిమాలు మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఎవరు గెలిచారు అనేది మాత్రం మనం చూడవచ్చు.

ముందుగా అజిత్ కుమార్ నటించిన తునీవు (తెలుగులో తెగింపు) మొదటి రోజు 41 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. అదే 11న కేవలం తమిళంలో రిలీజ్ అయిన వారీసు (తెలుగులో వారసుడు) 47.52 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. 12న రిలీజ్ అయిన వీరసింహా రెడ్డి 54 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. 13న విడుదలైన వాల్తేరు వీరయ్య 52 కోట్ల గ్రాస్ ను తీసుకువచ్చింది. దీంతో సంక్రాంతి పోటీలో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా చూస్తే.. నందమూరి నటసింహాం బాలయ్య గెలిచినట్లే.

- Advertisement -

అయితే ప్రస్తుతం పరిస్థితి కొంత వరకు మారింది. వాల్తేరు వీరయ్యకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. దీని ప్రభావం.. వీరసింహా రెడ్డిపై పడింది. రోజు రోజుకు కలెక్షన్లు తగ్గుతూ వస్తుంది. ఇదే సమయంలో వాల్తేరు వీరయ్య కు కొంత వరకు పెరుగుతున్నాయి. సంక్రాంతి విన్నర్ అనేది ప్రస్తుతం వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య మధ్య ఉందని చెప్పొచ్చు.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు