Virata Parvam : సురేష్ బాబుతో అంత ఈజీ కాదు మరి !

దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా విరాటపర్వం అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. 2019 నుండి ఈ చిత్రం పై ఉంది. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు జూన్ 17 న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి తో పాటు సురేష్ బాబు కూడా నిర్మాత అని పబ్లిసిటీ చేశారు. కానీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, సురేష్ బాబు ఈ చిత్రానికి ఫైనాన్సియర్ గా వ్యవహరిస్తున్నారట. రానా కాల్షీట్లు ఇవ్వాలి అంటే సురేష్ బాబు నిర్మాణంలో భాగస్వామి అయ్యుండాలి. సురేష్ బాబు ఉంటే, ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతాయని సుధాకర్ చెరుకూరి అందుకు అంగీకరించారని చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు సురేష్ బాబు, ఫైనాన్స్ చేసిన అమౌంట్ క్లియర్ చేయాలి అంటూ సుధాకర్ పై ఒత్తిడి పెడుతున్నారట. సినిమా రిలీజ్ తర్వాత కొంత తీర్చినా, ఇప్పుడైతే కొంత చెల్లించాలని కండీషన్ పెట్టినట్లు టాక్. దీంతో ఆ క్లియరెన్సులు చేసే పనిలో సుధాకర్ ఉన్నారట. ఇది తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, సురేష్ బాబు తో పార్ట్నర్ షిప్ అంటే మామూలుగా ఉండదు మరి అని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు