Virata Parvam : ఫ్లాప్ ను తప్పించుకున్న హీరో ?

రానా, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’. ఇటీవల అంటే జూన్ 17న విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది. ఇదే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లు చేశారు. నిర్మాత సురేష్ బాబు కూడా ఇదే చెప్పారని వినిపిస్తుంది. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.9 కోట్ల వరకు నష్టాలను మిగులుస్తుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి హీరోగా రానా ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట ఈ కథని వేరే హీరోకి వినిపించగా అతను వద్దు అని అన్నారట. దీంతో సురేష్ బాబు వద్దకు వెళ్లి రానాను ఫిక్స్ చేశాడట దర్శకుడు వేణు ఉడుగుల. ఈ చిత్రాన్ని వద్దనుకున్న హీరో మరెవరో కాదు గోపీచంద్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దర్శకుడు వేణు ఈ కథని మొదట గోపీచంద్ కు వినిపించగా, ఈ కథలో ఎక్కువగా హీరోయిన్ కే ప్రాముఖ్యత ఉందని చెప్పాడట. దీంతో ఈ కథ రానా వద్దకు వెళ్లినట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు