Venkatesh : వెంకీ మామ జాతి రత్నం ?

టాలీవుడ్ లో రీమేక్ లు చేయడంలో దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ మాత్రమే. గత ఏడాది వెంకటేష్ హీరోగా రెండు సినిమాల్లో నటించారు. అందులో ముందుగా నారప్ప సినిమా విడుదలైంది. ధనుష్ నటించిన తమిళ చిత్రం అసురన్ కు రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. కరోనా సమయంలో థియేటర్స్ ఓపెన్ లేకపోవడంతో ఈ సినిమాను అమెజాన్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. అయితే సీనియర్ అగ్ర కథానాయకులలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఓ యంగ్ డైరెక్టర్ తో పని చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ వేసవిలో ఎఫ్ 3 లో సందడి చేసిన వెంకటేష్, పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి హిందీ చిత్రం “కభి ఈద్ కభీ దివాళి” చేస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు వెంకీ మామ మరో యంగ్ డైరెక్టర్ తో పని చేయనున్నట్టు తెలస్తుంది. జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తెరకెక్కించిన అనుదీప్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వెంకీ కామెడీ యాంగిల్ ను ఫుల్ గా పడుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే డిసెంబరులో వెంకీ – అనుదీప్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.

దసరాకు ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నట్లు తెలుస్తుంది. కాగా ఇంతవరకూ ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ ఈమధ్యే విడుదలైన విడుదలైన ఎఫ్ 3 సినిమా వెంకటేష్ అభిమానులకు నిరాశే మిగిల్చింది. కాగా తమ అభిమాన హీరోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు వెంకీ మామ అభిమానులు. అయితే త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు