Varun Tej: మొదటిసారి మైత్రి ?

సుజీత్, షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి 23 ఏళ్లకే దర్శకుడిగా మారి శర్వానంద్ హీరోగా “రన్ రాజా రన్” సినిమాతో మంచి హిట్ కొట్టాడు.
రన్ రాజా రన్ సినిమా తరువాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న సుజీత్ “ప్రభాస్” తో సాహో సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.

రాజమౌళి తో వర్క్ చేసిన హీరోతో తన తరువాత సినిమా చెయ్యాలంటే ఏ దర్శకుడికైనా కొంచెం బెరుకు ఏర్పడుతుంది. రాజమౌళి సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంటుంది అని ఇప్పటివరకు ప్రూవ్ అవుతూ వచ్చింది.
అప్పటివరకు ఆ హీరోకు ఉన్న మార్కెట్, క్రేజ్ రాజమౌళి తో సినిమాను చేసిన తరువాత అమాంతం పెరుగుతుంది. సింహాద్రి, సై, ఛత్రపతి, మగధీర సినిమాలు ఇందుకు ఉదాహరణ.

అలానే ప్రభాస్ క్రేజ్ ను , మార్కెట్ ను అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి. అటువంటి ప్రాజెక్ట్ తరువాత సుజీత్ “సాహో” రిలీజ్ అవ్వడం, అంచనాలను ఊహించిన స్థాయిలో అందుకోలేకపోవడం కొంత నిరాశను మిగిల్చింది అని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ సినిమాకి బాలీవుడ్ లో భీభత్సమైన రెస్పాన్స్ , కలక్షన్స్ కూడా వచ్చాయి. ఏది ఏమైనా సినిమా ఫలితం ఎలా ఉన్నా సుజీత్ కష్టం మాత్రం వెండితెరపై క్షుణ్ణంగా కనిపించింది.

- Advertisement -

ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యని సుజీత్, ప్రస్తుతం ఒక మెగా హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో “రన్ రాజా రన్” తరహాలో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నాడట సుజీత్. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. నిజంగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మైత్రీ లో వరుణ్ తేజ్ చేయబోయే మొదటి సినిమా అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు