Saagar K Chandra : ‘భీమ్లా’ దర్శకుడికి హీరో దొరికాడు !

‘అయ్యారే’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి యావరేజ్ సినిమాలను తెరకెక్కించిన సాగర్ కె చంద్రకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ‘భీమ్లా నాయక్’ ద్వారా డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ఈ ఏడాది విడుదలైన మొదటి పెద్ద సినిమా ఇదే. మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టికెట్ రేట్ల ఇష్యు నడిచినప్పటికీ ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. కానీ, బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు కొద్ది దూరంలో ఆగిపోయింది. అయినప్పటికీ, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ భారీ లాభాలను అందుకుంది.

ఇక ‘భీమ్లా నాయక్’ తర్వాత సాగర్ చంద్ర వరుస సినిమాలతో బిజీ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ‘భీమ్లా’ సక్సెస్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ ఖాతాలో పడిపోయింది. ఇది ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ కాబట్టి తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు ఆయన స్క్రిప్ట్ లో మార్పులు చేయడం, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో సాగర్ కె చంద్రకు పెద్దగా పేరు రాలేదు. చాలా రోజుల వెయిటింగ్ తర్వాత సాగ్ చంద్రకు హీరో దొరికాడట. అతను మరెవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని నితిన్.సెప్టెంబర్ నుండి సాగర్ చంద్ర-నితిన్ కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు