Trivikram Srinivas : లయ వద్దకు మరోసారి ?

మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రి-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత వీరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఇది. స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయింది.సాంకేతిక నిపుణుల ఎంపిక ఎప్పుడో జరిగిపోయింది.ప్రస్తుతం నటీనటుల ఎంపిక ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది అని సమాచారం.సెకండ్ హీరోయిన్ గా ‘పెళ్ళి సందD’ హీరోయిన్ శ్రీ లీల ని ఎంపిక చేసుకున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. మరోపక్క శ్రీ లీల ఈ ఆఫర్ కు నో చెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా, ఆగస్టు నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు కూడా అధికారికంగా ప్రకటన చేశారు.

ఇది పక్కన పెడితే, ఈ చిత్రం ద్వారా సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. నిజానికి ‘అరవింద సమేత’ కోసమే లయను త్రివిక్రమ్ సంప్రదించారట. కానీ, ఆ పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పినట్లు లయ ఓ సందర్భంలో తెలిపింది. అయితే మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ మరోసారి లయను సంప్రదించాడట. అయితే లయ డెసిషన్ ఇంకా చెప్పలేదు అని తెలుస్తుంది. ఒక వేళ పాత్ర నచ్చి లయ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రీ ఎంట్రీ ఫిక్స్ అయినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు