Trivikram: ఉదయ్ కిరణ్ కథ తో మహేష్

మహేష్ బాబు కెరీర్ లో ‘అతడు’ మూవీ బ్లాక్ బస్టర్ కాకపోయినా.. ఓ డీసెంట్ హిట్ అనిపించుకుంది. కానీ బుల్లితెర పై మాత్రం ఈ మూవీ ఓ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఇప్పటికీ చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో ‘అతడు’ మూవీ కథని పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నట్టు త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. పవన్ కు ‘అతడు’ మూవీ కథ వినిపిస్తే నిద్రపోయినట్టు కూడా త్రివిక్రమ్ తెలియజేశాడు. అయితే ఈ చిత్రానికి పవన్ కూడా ఫస్ట్ ఛాయిస్ కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘అతడు’ నిర్మాత మురళీమోహన్ తెలియజేశాడు.

ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ … మురళీ మోహన్ కు బాగా క్లోజ్ అట. ‘అతడు’ సినిమాని ఉదయ్ కిరణ్ తో చేద్దాం అనుకుంటే.. అతని డేట్స్ ఖాళీ లేవట. ‘ఒక సంవత్సరం ఆగితే… తప్పకుండా చేస్తాను’ అని ఉదయ్ కిరణ్.. మురళీ మోహన్ కు చెప్పాడట. ఆ టైం లో వెయిట్ చేయడం కుదరక.. మహేష్ బాబు తో ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మురళీమోహన్ తెలియజేశాడు. ‘కృష్ణ కుటుంబంతో అతనికి ఉన్న సాన్నిహిత్యం వల్ల.. అడిగిన వెంటనే మహేష్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని ఈ సందర్భంగా మురళీ మోహన్ తెలియజేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు