Chiranjeevi: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గా పేరును సంపాదించుకున్న చిరుకి తాజాగా పద్మ విభూషణ్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నిన్న అనగా మే తొమ్మిదవ తారీకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము చేతుల మీదగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేశారు.
కాగా చిరంజీవి కి పద్మ విభూషణ్ రావడం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా ఇతర భాషలకు చెందిన ఇండస్ట్రీ వర్గాలు కూడా కంగ్రాట్స్ తెలియజేశాయి. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు సతీమణి సురేఖ కొడుకు రామ్ చరణ్ కోడలు ఉపాసన కూడా హాజరయ్యారు.
అంతే కాదు చిరంజీవి తో పాటు మరో ఐదుగురు కూడా పద్మ విభీషణ్ 17 మందికి పద్మభూషణ్ 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఇక ఈ క్రమంలో చిరంజీవికి పద్మ విభూషణ్ అందుకున్న మూమెంట్లో రామ్ చరణ్ మరియు ఉపాసన చేసిన ఓ పని హైలెట్గా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపతి మూర్ము చేతుల మీదగా చిరు పద్మవిభూషణ్ అవార్డు అందుకుంటున్న సమయంలో చరణ్ అదేవిధంగా ఉపాసన కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరి కళ్ళల్లో ఆ ఎమోషన్ చాలా క్లియర్ కట్ గా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.