SSMB29 : ఆ హీరోయిన్లు వద్దు ?

‘సర్కారు వారి పాట’ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలు చుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా త్రివిక్రమ్ తో, తర్వాత దర్శకధీరుడు జక్కన్నతో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. త్రివిక్రమ్ తో మహేష్ చేయబోయే SSMB28 జూలై 2వ వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేయబోయే SSMB29 చిత్రాన్ని హిందీ రాష్ట్రాల్ల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా జక్కన తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం రాజమౌళి బాలీవుడ్ నటీనటులను వాడాలని చూస్తున్నాడట. ‘ఆర్.ఆర్.ఆర్’ లో అజయ్ దేవగన్, అలియా భట్ లాంటి స్టార్లను పెట్టుకుని, హిందీ ప్రేక్షకులను మొదటి నుండి ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు SSMB29 సినిమాకు కూడా జక్కన్న ఇదే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ, మహేష్ మాత్రం ‘బాలీవుడ్ హీరోయిన్లు వద్దు. టాలీవుడ్ హీరోయిన్లనే పెట్టుకుందాం’ అని రిక్వెస్ట్ చేస్తున్నాడట. బాలీవుడ్ హీరోయిన్లతో కాల్ షీట్ల ప్రాబ్లమ్ ఉంటుందని, కాల్ షీట్లు కనుక అడ్జస్ట్ కాకపోతే ఎక్కువ సార్లు షూటింగ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకే మహేష్ ఇలా అంటున్నారని తెలుస్తుంది. మహేష్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లతో వర్క్ చేసిన అనుభవం ఉంది. అలియా భట్ విషయంలో రాజమౌళికి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది. మరి ఫైనల్ గా రాజమౌళి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి..!

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు