Soudarya Rajinikanth : మరోసారి తల్లి

ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రెండ‌వ కూతురు సౌంద‌ర్య ర‌జినీకాంత్ పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. దీంతో ర‌జినీకాంత్ మ‌రోసారి తాత‌య్య అయ్యాడు. ఇక ఇప్ప‌టికే సౌంద‌ర్య‌కి ఒక కుమారుడు వేద్ కృష్ణ ఉన్నాడు. ఇప్పుడు మ‌రో బిడ్డ‌కు తల్లి అయింది. విష‌గ‌న్ వ‌నంగ‌మూరి-సౌంద‌ర్య దంప‌తుల కుమారుడు. ఈ బాబుకి వీర్ రజినీకాంత్ వ‌నంగ‌మూడి అనే పేరు పెట్టారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా సౌంద‌ర్య ర‌జినీకాంత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని ఫోటోల‌ను షేర్ చేశారు. ముఖ్యంగా దేవుడి ద‌య‌, తల్లిదండ్రుల ఆశీర్వాదాల‌తో వేద్ కృష్ణ త‌మ్ముడు వీర్ ర‌జినీకాంత్ వ‌నంగ‌మూడికి విష‌గ‌న్‌, వేద్ నేను స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌నే క్యాప్ష‌న్ జోడించింది. ఇందుకు స‌హ‌క‌రించిన డాక్ట‌ర్లు సుమ‌న మ‌నోహ‌ర్‌, డాక్ట‌ర్ శ్రీ‌విద్య శేషాద్రిల‌కు సౌంద‌ర్య ర‌జినీకాంత్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

త‌న బాబు, భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు సౌంద‌ర్య‌. ఈమెకు తొలుత బిజినెస్ మ్యాన్ అశ్విన్ రామ్‌కుమార్‌తో పెళ్లి జ‌రిగింది. ఆ త‌రువాత వేద్ కృష్ణ జ‌న్మించారు. 2017లో మొద‌టి భ‌ర్త అశ్విన్ రామ్‌కుమార్‌తో విడిపోయి 2019లో వ్యాపార‌వేత్త విష‌గ‌న్ వ‌నంగ‌మూడిని రెండో మ్యారేజ్ చేసుకున్నారు. తాజాగా ఈ దంప‌తుల‌కు వీర్ అనే బాబు జ‌న్మించాడు. తొలుత ఈమె గ్రాఫిక్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. రజినీకాంత్ తో యానిమేష‌న్ మూవీ కొచ్చ‌డ‌యాన్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు సౌంద‌ర్య‌. మ‌రోవైపు ధ‌నుష్‌తో వీఐపీ2 సినిమాని తెర‌కెక్కించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు