Shruti Haasan : మిస్ అవుతున్నాను

శృతిహాసన్.. ఐరన్ లెగ్ అన్న పేరు నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగుతో పాటు సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ బాక్సాఫీసు దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతిహాసన్ కు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం లభించింది.

ఈ మూవీ తర్వాత శృతిహాసన్ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం శృతిహాసన్ నటిస్తున్న ఇంటర్నేషనల్ మూవీ “ది ఐ”. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్ లో జరుగుతుంది. దర్శకుడు డాఫ్నే ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో భాగంగా శృతిహాసన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సినిమాలోని నటించడం తన కెరీర్ లోనే లభించిన అరుదైన అవకాశం అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.

అయితే మంచి సినిమాలో నటిస్తున్నాననే సంతోషం ఒకవైపు.. ఇంటిని, తన వాళ్ళని మిస్ అవుతున్నాను అనే బాధ మరోవైపు కలుగుతున్నాయని చెప్పింది. తను ప్రేమించే కళారంగంలో లభిస్తున్న అవకాశాల పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. తన జీవితంలో సంతోషం, ప్రేమకు కొదవలేదని చెప్పింది. ఇక ఇదిలా ఉండగా శృతిహాసన్ ప్రస్తుతం బాలయ్య 107 సినిమాలో, అటు మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు