Sampath Nandi: మరోసారి రవితేజతో

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. జయపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు రవితేజ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ” రావణాసుర”, ” టైగర్ నాగేశ్వరరావు” సెట్స్ పై ముస్తాబవుతున్నాయి. మరోవైపు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ జాబితాలో మరొ కొత్త ప్రాజెక్టు వచ్చి చేరింది. దర్శకుడు సంపత్ నందితో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. రవితేజ కి సంపత్ నంది ఓ కథ చెప్పాడని, రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారని, ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెలుస్తోంది. ఇంతకుముందు సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ సినిమాలో నటించారు రవితేజ. రవితేజ కథానాయకుడిగా, తమన్నా, రాశిఖన్నా లు కథానాయికలుగా సంపత్ నంది దర్శకత్వం వహించిన బెంగాల్ టైగర్ చిత్రానికి కేకే రాధ మోహన్ నిర్మాతగా డిసెంబర్ 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. ఈ మూవీలో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలిసింది. మరి రవితేజ ఇమేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు