Samantha: జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యశోద సినిమాతో హిట్ కొట్టి శాకుంతలం మూవీతో రెడీ ఉన్న హీరోయిన్ సమంత. రీసెంట్ డేస్ లో ఏం చేసిన వైరల్ అవుతుంది. నాగచైతన్యతో లవ్ మ్యారేజ్, ఆ తర్వాత విడాకుల నుంచి ఈ బ్యూటీ మరింత పాపులర్ అయింది.

అయితే చైతో డైవర్స్ తర్వాత కూడా ఆ కుటుంబంలోని హీరోలకు, వారి సినిమాలకు రియాక్ట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా హీరో అక్కినేని అఖిల్ షేర్ చేసిన ఓ పోస్ట్ కు సమంత కామెంట్ చేసింది. అఖిల్ చేసిన ఏజెంట్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు బీస్ట్ మోడ్ ఆన్ అంటూ సమంత కామెంట్ చేసింది.

ఇక మయోసైటీస్ అనే అరుదైన కండరాల వ్యాధి భారిన పడి కోలుకుంటున్నా ఆమె ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నది. త్వరలో తెలుగు ‘ఖుషి‘ సినిమా సెట్స్ లో జాయిన్ కానుంది. గత కొద్ది రోజులుగా సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్ఫూర్తినిచ్చే మాటలు పోస్ట్ చేస్తున్నది. పరిస్థితులు అన్నీ క్రమంగా సర్దుకుంటున్నాయని, తాను కష్టాల నుంచి బయటపడుతున్నానని, తన తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది.

- Advertisement -

‘గత కొన్ని నెలలుగా ఇబ్బందికరమైన రోజుల్ని చూస్తూ ధైర్యంగా ఉన్నావు. నీ విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మరింత ధైర్యంగా ముందుకు సాగిపో’ అంటూ తనకు తాను ధైర్య వచనాలు చెప్పుకుంటూ సమంత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా ‘సిటాడెల్’ షూటింగుకు బయలుదేరుతూ కారులో ప్రయాణిస్తున్న ఫోటోను షేర్ చేసింది. దానికి ‘వెలుతురు కోసం మనమే అన్వేషించాలి’ అనే వాక్యాలను జోడించింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు