Venkatesh: పని పూర్తయింది..’సైంధవుడు’ యుద్ధానికి రెడీ..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కి రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం జరిగింది. కోలీవుడ్ నటులు ఆర్య, ఆండ్రియా తో పాటు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే నిజానికి సైంధవ్ డిసెంబర్ 22న రిలీజ్ కావాల్సి ఉండగా ‘సలార్’ సినిమా వల్ల సంక్రాంతికి షిఫ్ట్ చేసారు.

ఇక సైంధవ్ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కగా, రిలీజ్ అయిన టీజర్, పాటలతో హైప్ ని భారీగా పెంచేశారు మేకర్స్. ఇక తాజాగా సైంధవ్ సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వాళ్ళు U/A సర్టిఫికెట్ ని ఇవ్వడం జరిగింది. రన్ టైం కూడా 2 గంటల 35 నిమిషాలకు అటు ఇటుగా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమా స్టోరీ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో నడుస్తుందని టీజర్ లో చెప్పడం జరిగింది.

ఇక సంక్రాంతి కి రాబోతున్న సినిమాల్లో ఇప్పటికే హనుమాన్ మూవీ కూడా సెన్సార్ కి వెళ్లగా ఆ మూవీ కి కూడా U/A సర్టిఫికెట్ వచ్చింది. ఇక గుంటూరు కారం, ఈగల్ రెండే మిగిలాయి. నా సామి రంగ దాదాపు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక సైంధవ్ సినిమాకు అన్ని అడ్డంకులు తొలగిపోగా సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ పై యుద్ధమే మిగిలిందని చెప్పొచ్చు. వెంకటేష్ నటించిన గత చిత్రాల కంటే భారీ హైప్ ఈ సినిమా పై ఉంది. అందువల్ల భారీ ఓపెనింగ్స్ ఈ సినిమా కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు