సౌత్లో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం ఈమెకు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కేవలం కోలీవుడ్లో కమల్హాసన్ సరసన మాత్రమే రకుల్ ఇండియన్ 2లో నటిస్తోంది. ఇక ఈ చిత్రంపై ఈమె భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలోనే రకుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
కరోనా సమయంలో ప్రేక్షకుల అభిరుచి మారిందనే పేర్కొంది. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలకు ప్రేక్షక ఆదరణపై ఆమె స్పందించింది. ముఖ్యంగా సినిమాల కంటెంట్, విజయం సాధించిన చిత్రాల గురించే పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇది ఆరోగ్యకరమైన పరిస్థితులకు దారి తీస్తోందని చెప్పుకొచ్చింది. దీని వెనుక చాలా శ్రమనే ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు మంచి విజయాలను సాధిస్తున్నాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.
బాలీవుడ్లో డాక్టర్జీ, ఛత్రివాలీ, థ్యాంక్గాడ్ వంటి సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో చివరగా ‘కొండపొలం’ తరువాత ఈ బ్యూటీ ఏ సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తోంది. ఈమెకు ఆఫర్ ఎప్పుడు వస్తుందో.. ఇండియన్ 2 తరువాత ఏ డైరెక్టర్తో నటిస్తుందో వేచి చూడాలి.