Priya Anand : రానా హీరోయిన్ రీ ఎంట్రీ !

ప్రియా ఆనంద్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. రానా దగ్గుబాటి డెబ్యూ మూవీ ‘లీడర్’ ద్వారా ప్రియా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్ గా ప్రియా ఆనంద్ నటించింది. దీని తర్వాత రామ్ పోతినేనితో ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాలో ఆడిపాడింది. తర్వాత ‘180’లో సిద్దార్థ్ , ‘కో అంటే కోటి’లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కనిపించింది.

అందం, అభినయం కలిగిన ఈ నటి మంచి కథల్ని ఎంపిక చేసుకోగలదు. కానీ తెలుగులో సరైన బ్రేక్ వచ్చేలోపే, తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి అని వెళ్ళిపోయింది. అక్కడ బిజీ అవ్వడంతో పదేళ్ళ పాటు టాలీవుడ్ కు దూరమైంది. తాజా గా ప్రియా ఆనంద్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇ్వడానికి రెడీ అవుతుంది. ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్ నటించబోతుంది.

నాగ శౌర్య హీరోగా నటించిన ‘వరుడు కావలెను’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన లక్ష్మీ సౌజన్య ‘మా నీళ్ల ట్యాంక్’ వెబ్ సిరీస్ ను రూపొందిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా ఆనంద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. జూలై 15 నుండి ‘జీ5’ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సుశాంత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరి రీ ఎంట్రీలో అయినా ఈ అమ్మడు రాణిస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు