Prabhas & Allu Arjun : ఒకే వేదికపై ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడికో ఎదిగిపోయింది అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాకు ముందు తెలుగు సినిమా అంటే అందరికీ ఒక చిన్న చూపు ఉండేది. కానీ బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా అంటే అందరూ తలెత్తి చూడటం మొదలుపెట్టారు. తెలుగు సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఎస్.ఎస్ రాజమౌళి. ఒక సినిమా కోసం దాదాపు 5 ఏళ్లపాటు కష్టపడి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు రాజమౌళి. ఆ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన ప్రతి సినిమాకి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు ని తీసుకొచ్చి పెట్టింది.

Prabhas & Allu Arjun : Two pan India stars on the same stage
Prabhas & Allu Arjun : Two pan India stars on the same stage

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ పాన్ ఇండియా స్టార్ హీరోస్ లో అల్లు అర్జున్ ప్రభాస్ లు కూడా ఉంటారు. వీరిద్దరూ నుంచి ఒక సినిమా వస్తుందనంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. తమ కెరియర్లో బాగా కష్టపడి ఇద్దరు ఈ స్థాయికి వచ్చారని చెప్పొచ్చు. అయితే వీరిద్దరి మధ్య కూడా ఒక పర్సనల్ బాండింగ్ కూడా ఉంది. ఒకటంటే ఒకరికి విపరీతమైన గౌరవం కూడా ఉంది ఇదివరకే చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై కలిశారు.

ఇద్దరి సినిమాలు కోసం ప్రపంచం ఎదురుచూస్తుంది

- Advertisement -

ఇకపోతే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అదే రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయాయి. కానీ ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా పైన అందరికీ మంచి నమ్మకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇకపోతే రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు అల్లు అర్జున్.

ఒకే వేదికపై ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్

పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన మరో సినిమా కూడా పుష్పా అని చెప్పొచ్చు. ఇప్పుడు పుష్ప టు సినిమా కోసం చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇదివరకే రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ కూడా అంచనాలను మరింత పెంచిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఒకే వేదికపై కనిపించనున్నారు. మే 19న జరగబోయే డైరెక్టర్స్ ఈవెంట్ కి వీరిద్దరూ హాజరుకానున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్ డే గా జరుపుకునే విషయం మనకు తెలిసింది. ఈ తరుణంలోనే డైరెక్టర్ ఈవెంట్ మే 19 జరుపుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి ప్రభాస్ అల్లు అర్జున్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు