సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తుంది.
ఇదివరకే పక్కా కమర్షియల్ నుంచి విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ ను నేడు సాయంత్రం విడుదల చేసారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే గోపిచంద్ పెర్ఫార్మన్స్ , రాశిఖన్నా కేరక్టరైజేషన్ , మారుతి తన మార్క్ కామెడీ పర్ఫెక్ట్ సమపాళ్లలో కుదిరాయని అర్ధమవుతుంది. అలాగే గోపిచంద్, డబ్బుల కోసం ఏదైనా చేసే వ్యక్తి పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. విలన్ చేసే అక్రమాలను కప్పిపెట్టడానికి గోపిచంద్ వాదిస్తున్నట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. మొత్తంగా హీరో క్యారెక్టర్ యే పక్కా కమర్షియల్.
దీనితో పాటు ప్రతినాయకుడుగా రావు రమేశ్, హీరో తండ్రిగా సత్యరాజ్ కనిపించబోతున్నారు. కాగ ఈ సినిమాను యూవీ క్రయేషన్స్, జీఎ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నివాస్, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా నిర్మించారు. జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.