Naresh Wife: ప్రశాంత్ నీల్ బంధుత్వం

ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు నరేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు చేసుకున్న అతను త్వరలో సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి నరేష్ నాకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకుంటాడు అంటూ రచ్చ చేయడం మొదలు పెట్టింది. గతంలో ఈమె టాలీవుడ్ సెలబ్రిటీలు వద్ద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టింది అంటూ ఈమె పై అభియోగాలు ఉన్నాయి. ఈమెతో తనకి సంబంధం లేదు అని నరేష్ అప్పుడే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక నరేష్ మరో పెళ్లి విషయంలో ఈమె అభ్యంతరాలు తెలుపుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా రమ్య రఘుపతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

ఈమె కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మధ్య బంధుత్వం ఉందట. వరుసకు ఈమె ప్రశాంత్ నీల్ కు సోదరి అవుతుందట. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా, మ‌డ‌క‌శిర‌లోని నీల‌కంఠ‌పురం గ్రామానికి చెందిన వారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన రఘువీరారెడ్డి, రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు అవుతారు. ఆ రకంగా వీళ్ళకి బంధుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.ఈ రెండు ఫ్యామిలీ లు చాలా కాలం క్రితమే కర్ణాటక లో సెటిల్ అయినట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు