Tollywood : క్రేజీ మల్టీస్టారర్ కు ప్లాన్

అక్కినేని నాగార్జున తాజాగా నటించిన చిత్రం ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుండి ట్రైలర్ గురువారం విడుదల చేశారు. సూపరం స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ లో నాగార్జున స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే గన్స్, తల్వార్ లతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదిన విడుదల కాబోయే ఈ చిత్రంపై ట్రైలర్ అంచనాలను పెంచుతుంది.

అయితే ట్రైలర్ విడుదల సందర్భంగా మహేష్ బాబు, నాగార్జున మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తిరమైన చర్చ జరిగింది. వీళ్ల ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా ది ఘోస్ట్ ట్రైలర్ ను తాను విడుదల చేస్తున్నందకు సంతోషంగా ఉందని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు నాగ్ రిప్లే ఇస్తూ.. “హే మహేష్ .. 29 సంవత్సరాల క్రితం వారసుడు సినిమాతో మీ నాన్న కృష్ణగారితో కలిసి నటించాను. అప్పుడు నేను చాలా ఆనందంచాను. ఇప్పుడు మళ్లీ మనం ఎందుకు చేయకూడదు” అని రాసుకొచ్చాడు.

దీనికి సమాధానంగా మహేష్ బాబు.. “ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది ముందుకు వెళ్లడానికి కోసం ఎదురుచూడాలి” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్స్ తో కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు తొందరలోనే కలిసి ఒక సినిమా చేస్తారని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు