Manchu Vishnu : మోసపోయాను

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత  సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా గురించి మంచువిష్ణు స్పందించారు.  రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. ఓంరౌత్ దర్శకుడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సినీ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఆదిపురుష్ టీజర్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంచువిష్ణు నటిస్తున్న జిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లైవ్ యాక్షన్ చిత్రాన్ని రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తారని అనుకున్నాం. కానీ ఇది ఒక యానిమేటేడ్ సినిమా అని అస్సలు ఊహించలేదు. అందుకోసమే ఈ టీజర్ విడుదలైనప్పుడు చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇది యానిమేటేడ్ సినిమా అని చెబితే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కావని, ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్స్ సాధారణంగానే వస్తాయి. టీజర్ చూసి నేను మోసపోయాను’ అని చెప్పుకొచ్చాడు విష్ణు. 

“బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి రామాయణం వస్తుందంటే భారీగా ఊహించుకున్నా. అందులో తానాజీ చిత్ర దర్శకుడు దీనిని తెరకెక్కిస్తున్నారంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇలాంటి సమయంలో యానిమేటెడ్ వీడియో చూస్తే ఇలాంటి స్పందనలే వస్తాయి” అని మంచు విష్ణు వివరించారు. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు