SSMB28: మార్పులు కోరిన మహేష్

తెలుగులో ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలు చేసాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా సినిమాకి విభిన్న కథాంశాలను ఎన్నుకుని సినిమాలు చేసే మహేష్, స్పైడర్ సినిమా తరువాత ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస సినిమాలతో హిట్స్ కొట్టిన కూడా మహేష్ అభిమానులకు కొద్దిపాటి అసంతృపి ఉంది అనేది చాలామంది అభిప్రాయం.

రీసెంట్ గా రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాతో వింటేజ్ మహేష్ ను బయటకు తీసే ప్రయత్నం చేసాడు దర్శకుడు పరశురామ్. కానీ “సర్కారు వారి పాట” పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రస్తుతం మహేష్ అభిమానుల ఆశలన్నీ త్రివిక్రమ్ మహేష్ తో చేయబోయే సినిమాపైనే ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికి ఒక ఫీల్ ను క్రియేట్ చేస్తాయి.

అతడు సినిమాలో మహేష్ బాబు ను సెటిల్డ్ గా చూపించిన త్రివిక్రమ్,
ఖలేజా సినిమాతో మహేష్ లోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు.
ముచ్చటగా మూడోసారి చేయబోతున్న SSMB28 లో త్రివిక్రమ్ మహేష్ ను ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ చాలామంది ప్రేక్షకులలో ఉంది . ఇప్పటికే కథను మహేష్ కి వినిపించాడు త్రివిక్రమ్. కథను విన్న మహేష్, స్క్రిప్ట్ లో కొద్దిపాటి మార్పులు కోరినట్లు తెలుస్తోంది. మార్పులు అన్ని సక్రమంగా జరిగితే జులై నెల చివరనుండి SSMB28 సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు