Kalyan Ram : తారక్ ను కాదని, బాబయ్ వద్దకు ?

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ 6 ఏళ్లుగా ఇద్దరూ ఒకే మాట పై ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా చాలా సినిమాలు చేశాడు. అందులో హిట్ అయినవి ఒకటి రెండు మాత్రమే. కొన్ని యావరేజ్ లు అనిపించుకున్నాయి. మొత్తంగా కళ్యాణ్ రామ్ చాలా నష్టపోయాడు. అప్పులపాలయ్యాడు.
ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ కోసం తారక్ ‘జై లవ కుశ’ చేశాడు. ఈ ఒక్క సినిమాతో కళ్యాణ్ రామ్ అప్పులన్నీ తీరిపోయాయి. ఆ సినిమా తర్వాత తమ్ముడు ఎన్టీఆర్ సలహాతో నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ హీరో మినిమమ్ మార్కెట్ ఉంది. కాబట్టి, ఆ మార్కెట్ కు తగ్గ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ‘బింబిసార’ విషయంలో తారక్ కు ఇచ్చిన మాట తప్పాడు. అది కూడా ఎన్టీఆర్ పర్మిషన్ తోనే. ‘బింబిసార’ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ పై హరికృష్ణ.కె తో నిర్మించారు. అలాగే ఈ చిత్రం విషయంలో ఎన్టీఆర్ ను పక్కన పెట్టి ఎక్కువగా బాలయ్య సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంటే వీరి మధ్య గ్యాప్ వచ్చిందని నెగిటివ్ గా వెళ్లిపోకండి. ఇందుకు ఓ కారణం ఉంది. బాలయ్యకు ఎన్నో చారిత్రాత్మక సినిమాలు చేసిన అనుభవం ఉంది. దీంతో బాలయ్య సలహాలు ఉపయోగపడుతాయి. ఈ సలహాలు బింబిసార పాత్ర మరియు డైలాగ్ మాడ్యులేషన్ కోసం మాత్రమే అని తెలుస్తుంది. దర్శకుడు వశిష్ట్ కు మాత్రం కళ్యాణ్ రామ్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. అలా అని వశిష్ట్ ఎక్కువ బడ్జెట్ పెట్టించలేదట. రూ.45 కోట్లు అనుకుంటే కరోనా కారణంగా మరో ఐదో, పదో పెరిగినట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు