Harish Shankar : నా హీరోలు లైవ్ వైర్ ఎంటర్టైనర్స్

Harish Shankar : షాక్ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఒక దర్శకుడిగా సినిమాను తీసిన తర్వాత కూడా మళ్లీ ఇంకో దర్శకుడు దగ్గర పని చేయాలని చాలామంది అనుకోరు. కానీ హరీష్ శంకర్ అలా కాకుండా పూరి జగన్నాథ్ దగ్గర రచయితగా అసోసియేట్ గా పనిచేశాడు. ఇకపోతే షార్ట్ సినిమా తర్వాత మళ్లీ మిరపకాయ్ అనే సినిమాతో అవకాశాన్ని ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

మిరపకాయ్ తో మరో అవకాశం

మిరపకాయ్ సక్సెస్ తర్వాత హరి శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా ఈ సినిమా తుడిచి పెట్టేసింది. పవన్ కళ్యాణ్ లో అభిమానులు ఎప్పటి నుంచో మిస్సయిన ఎనర్జీ మొత్తాన్ని బయటికి తీశాడు. పవన్ కళ్యాణ్ తిక్క తో బాక్స్ ఆఫీస్ తొక్క తీశాడు. కొత్త రికార్డ్స్ కి కొత్త కలెక్షన్స్ కి దారి వేశాడు. పవన్ కళ్యాణ్ కి ఒక ప్రాపర్ హిట్ సినిమా పడితే ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనం గబ్బర్ సింగ్.

Harish Shankar

- Advertisement -

హరీష్ సినిమాల్లో హీరోలు

ఇకపోతే హరీష్ శంకర్ సినిమాల్లో హీరోలకి ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. హరి శంకర్ సినిమాల్లో హీరోలు అంతా కూడా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తారు. సెటైర్లు వేస్తారు. ఇప్పటివరకు హరీష్ శంకర్ చేసిన సినిమాలు అన్నిటిలో కూడా ఇదే మాదిరిగా ఉంటారు. ఇకపోతే హరీష్ ఇచ్చినా ఒక రీసెంట్ ఇంటర్నేషనల్ నా సినిమాలలో హీరోస్ లైవ్ వైర్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ నేను కథను రాసుకుంటాను, క్యారెక్టర్ ను బాగా రాసుకుంటాను. నేను 25% రాస్తే 60 శాతం యాక్టర్స్ దానిని నిలబెడతారు అని నేను బలంగా నమ్ముతాను. మిగతా టెక్నీషియన్స్ అంతా కలిపి దానిని 100% కి తీసుకెళ్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా హిందీ సూపర్ హిట్ సినిమా రైడ్ కి రీమేక్ అని తెలుస్తుంది. ఈ సినిమాకి మీక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటు హరీష్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు