Hanuman : దిల్ రాజుకి పరువు దెబ్బ…

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ పోటీ గుంటూరు కారం, హనుమాన్ సినిమాల మధ్య జరిగిందన్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి ముగిసిన తర్వాత ఫైనల్ గా హనుమాన్ నే సంక్రాంతి విజేత గా జనాలు గెలిపించారు. అయితే ఈ సినిమాలు రిలీజ్ కావడానికి రెండు వారాల ముందు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల మధ్య థియేటర్ల రగడ జరిగిందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా నైజాంలో హనుమాన్ కి రావలసిన థియేటర్లలో గుంటూరు కారం ప్రదర్శిస్తూ థియేటర్లు దక్కకుండా చేసాడని నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు పై అపవాదు వచ్చేలా చేసింది.

అయితే హనుమాన్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి మూవీ మేకర్స్ పిర్యాదు చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక నెక్స్ట్ డే నుండే హనుమాన్ చిత్ర ప్రదర్శన వెయ్యాలని నిర్మాతల మండలి కూడా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా గుంటూరు కారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా పండగ తర్వాత డల్ అవగా, అదే సమయంలో డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న హనుమాన్ పండగ లో సాలిడ్ గ్రోత్ చూపించి వారంలోనే నైజాంలో బ్రేక్ ఈవెన్ అయ్యింది. తాజాగా దిల్ రాజుని పరువు దెబ్బ కొట్టేలా హనుమన్ కలెక్షన్లలో భారీ రికార్డుని క్రియేట్ చేసింది.

గుంటూరు కారం నైజాం కలెక్షన్లను మొత్తం హనుమాన్ 16 రోజుల్లో బ్రేక్ చేసింది. గుంటూరు కారం ఇప్పటివరకు నైజాం లో 33.63 కోట్ల షేర్ వసూలు చేయగా, తాజాగా హనుమాన్ బ్రేక్ చేస్తూ 34.22 కోట్ల షేర్ కలెక్షన్స్ తో ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుంది. ఇక హనుమాన్ నైజాం డిస్ట్రిబ్యూటర్లయిన మైత్రి మూవీ మేకర్స్ కి పెటుబడిపై 27 కోట్ల భారీ లాభం దక్కగా, గుంటూరు కారం రిలీజ్ చేసిన దిల్ రాజు కి 6 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఏది ఏమైనా ఎక్కడైతే సినిమాకు థియేటర్లు దక్కకుండా అడ్డుకున్నారో అక్కడే వాళ్ళ సినిమా వసూళ్లను బ్రేక్ చేయడం పరువు దెబ్బ తీయడమే అని నెటిజన్లు అంటున్నారు.

- Advertisement -

For More Updates :Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు