Gargi : హిట్ టాక్ వచ్చినా ?

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తాజాగా నటించిన సినిమా గార్గి. టైటిల్ రోల్ ను సాయి పల్లవి పోషించింది. తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా డబ్ అయ్యింది. శుక్రవారం ఈ గార్గి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలు, రేటింగ్ లను సొంతం చేసుకుంది. అలాగే సాయి పల్లవి నటన సినిమాకే హైలైట్ గా ఉంది. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ చిత్రం చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

‘గార్గి’ తో పాటు ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మై డియర్ భూతం’ అనే చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. ఇది కూడా తమిళంలో రూపొందిన మూవీనే. తెలుగులోకి డబ్ చేసి, విడుదల చేశారు. ఈ మూవీకి కూడా మంచి టాక్ వచ్చింది. ప్రభుదేవా నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను, కిడ్స్ ను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మన్స్ చాలా ఘోరంగా ఉంది. చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి అని సమాచారం. మరోపక్క అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్న ‘ది వారియర్’ కు బుకింగ్స్ బాగున్నాయి. అయితే, పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ‘గార్గి’ ‘మై డియర్ భూతం’ మాత్రం రాణించలేకపోతున్నాయి. దీనికి కారణం ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం వల్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు