Gangs of Godavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని వదులుకున్న హీరో ఎవరో తెలుసా?

Gangs of Godavari : యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31న బిగ్ స్క్రీన్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. విశ్వక్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీని థియేటర్లలో వీక్షిస్తామా? అని ఆతృతగా వెయిట్ చేస్తున్న తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు డైరెక్టర్. ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ విశ్వక్ సేన్ కాదంటూ దర్శకుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని వదులుకున్న హీరో ఎవరో చెప్పేశారు. మరి ఈ ప్రాజెక్టును మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసుకుందాం పదండి.

మరికొన్ని గంటల్లోనే థియేటర్లలోకి రాబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది మూవీ టీం. అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మూవీ దర్శకుడు కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ప్రధాన పాత్రకు తన ఫస్ట్ ఆప్షన్ ఎవరు అనే విషయాన్ని వెల్లడించాడు. డైరెక్టర్ తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని వదులుకున్న హీరో

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ కాదు శర్వానంద్ ఉండాల్సింది. తాజాగా జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ “నేను మొదట ఆర్టిస్ట్ ఆనంద్ రామరాజుతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆలోచనను పంచుకున్నాను. అక్కడ నుండి మేము కథపై పని చేయడం ప్రారంభించాము. ఈ సినిమా మొదట శర్వానంద్‌తో మొదలైంది. అయితే శర్వానంద్ ఇది ఒక భావోద్వేగ చిత్రం కాబట్టి హోల్డ్‌లో ఉంచమని అడిగాడు. దీంతో కొంతకాలం వెయిట్ చేశాము. కానీ నా మరో సినిమా కూడా హోల్డ్‌లో ఉంచాల్సి వచ్చిది. దీంతో చాలా గ్యాప్ వస్తుందని నేను భయపడ్డాను. అందుకే శర్వానంద్ కు కన్విన్స్ చేసి తరువాత విశ్వక్ సేన్ వద్దకు వెళ్లి కథను వివరిచాను. అదృష్టవశాత్తూ విశ్వక్ కథను ఇష్టపడ్డాడు” అంటూ ఈ మూవీని శర్వానంద్ ఎలా చేజార్చుకున్నాడో స్వయంగా డైరెక్టర్ వెల్లడించారు.

- Advertisement -

Vishwak Sen to Replace Sharwanand?

ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్

తరువాత డైరెక్టర్ కృష్ణ మరో ఆసక్తికరమైన కథను పంచుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ ఇంతకు ముందు ఈషా రెబ్బాతో ఐటెమ్ ట్రాక్‌ను ఒక రోజు చిత్రీకరించిందని పేర్కొన్నారు. అయితే కొన్ని వైద్య సమస్యల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగిందని, తరువాత అవకాశం అయేషా ఖాన్‌కు వెళ్లిందని ఆయన వెల్లడించాడు.

ఈ యాక్షన్ డ్రామాలో విశ్వక్ సేన్ హీరోగా, అంజలి, నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. రాధిక, నాజర్,  ఆయేషా ఖాన్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని సంయుక్తంగా నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న ఈ మూవీతో విశ్వక్ యాక్షన్ మూవీతో హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు