Meena: అంతిమ నివాళులు

నటి మీనా భర్త, విద్యాసాగర్ నిన్న (జూన్ 28) రాత్రి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు మరియు అతని అకాల మరణం ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో విద్యాసాగర్ ప్రాణాలు కోల్పోయారు. 48 ఏళ్ల వయస్సులోనే ఆయన తుది శ్వాసను విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న సాగర్, మార్చి 2022 చివరి వారంలో కోవిడ్ 19 బారిన పడ్డాడు. అప్పటినుండి అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది.

నిన్న రాత్రి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యాసాగర్ భౌతికకాయాన్ని ఇప్పుడు చెన్నైలోని ఆయన నివాసంలో సినీ ప్రముఖుల అంతిమ నివాళులర్పించేందుకు ఉంచారు. ఈ ఉదయం నుండి పలువురు ప్రముఖ సినీ, బుల్లితెర తారలు నివాళులర్పిస్తున్నారు. అంతిమ నివాళులు అర్పించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మీనా ఇంటికి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రజనీకాంత్ మీనాతో గతంలో పలు చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ మీనాకు సన్నిహిత కుటుంబ స్నేహితుడు అని తన అనేక ఇంటర్వ్యూలలో వ్యక్తం చేసారు మీనా.

విద్యాసాగర్, మీనాను జూన్ 12, 2009న వివాహం చేసుకున్నారు. వీరికి నైనిక అనే కుమార్తె ఉంది. అట్లీ దర్శకత్వం వహించిన తలపతి విజయ్ తేరిలో కూడా నైనికా నటించింది. విద్యాసాగర్ భౌతికకాయాన్ని ఇప్పుడు చెన్నైలోని ఆయన నివాసంలో పరిశ్రమకు చెందిన వారి అంతిమ నివాళులర్పించేందుకు ఉంచారు. దహన సంస్కారాలు మధ్యాహ్నం 2 గంటలకు బీసెంట్ నగర్‌లో జరగనున్నాయి.

- Advertisement -

ఈ మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సానుభూతిని తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు