AA22: త్రివిక్రమ్ ఆ ముగ్గురు హీరోలను ఇంకా వదలడా..!

డైలాగ్ రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు గురూజీ అంటూ త్రివిక్రమ్ ను ఆకాశానికెత్తేసిన సోషల్ మీడియా యువత, ఇప్పుడు అదే గురూజీని పలు కారణాల వల్ల ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్న త్రివిక్రమ్, ఆయన నెక్స్ట్ సినిమాని మళ్ళీ అల్లు అర్జున్ తో చేయనున్నట్టు ప్రకటన వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే బన్నీ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు నాలుగో సినిమా కూడా ఆయనతోనే చేస్తుండటంతో త్రివిక్రమ్ నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు.

అయితే దీనికి కారణం ఏంటంటే త్రివిక్రమ్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో ఎక్కువ సినిమాలు చేయడమే. గురూజీ రాసుకున్న ప్రతి కథను ఐతే పవన్ కళ్యాణ్, లేదా మహేష్, అల్లు అర్జున్ వీళ్ళకి తప్ప త్రివిక్రమ్ వేరే హీరోలెవ్వరికి కథలు వినిపించడు. అలాగే ఈ ముగ్గురు హీరోలు వేరే దర్శకులతో పని చేసే అవకాశం కూడా ఇవ్వడు. ముందే వీరి ముగ్గురి డేట్స్ లాక్ చేసేస్తాడు. దాంతో వేరే దర్శకులకు వీళ్ళతో పని చేసే అవకాశం తక్కువగా వస్తుంది.

- Advertisement -

ఈ విషయం ఆ మధ్య బాగా హైలెట్ అవడంతో ఆయన ఎన్టీఆర్ తో కలిసి అరవింద సామెత సినిమా, అలాగే యంగ్ హీరో నితిన్ తో అ ఆ అనే సినిమా చేసాడు.ఈ సినిమాల తరువాత సరే గురూజీ మారిపోయాడనుకుంటుండగానే మళ్ళీ మహేష్, అల్లు అర్జున్ లతో సినిమాలుఎనౌన్స్ చేస్తూ, పాత పద్ధతినే కంటిన్యూ చేస్తున్నాడు.

అయితే త్రివిక్రమ్ ఈ ముగ్గురు స్టార్స్ తో చేసే సినిమాలు వాళ్ళ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ అవుతున్న కూడా ఈ రకమైన కామెంట్స్ తెరపైకి ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు. బహుశా ఫ్యాన్స్ కు గురూజీ సినిమాలు బోర్ కొట్టేసాయేమో..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు