Rashmi: చిన్నారిపై కుక్క దాడి.. రష్మి వివాదాస్పద ట్విట్ !

Rashmi: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉదయం విషాదం జరిగింది. తాండూరు నియోజకవర్గంలో ఓ ఐదు నెలల చిన్నారి కుక్క దాడిలో మరణించింది. పెంపుడు కుక్క దాడి చేయడం కారణంగా ఆ ఐదు నెలల పసికందు మరణించింది. అయితే కోపంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు… పెంపుడు కుక్కను చంపేశారు. దీంతో ఈ సంఘటన వివాదంగా మారింది.

అయితే ఈ సంఘటనపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ… ఈ విషయం యాంకర్ రష్మీకి తెలిస్తే సీరియస్ అవుతుందని… సెటైర్లు వేస్తూ కామెంట్ చేశాడు. అయితే ఆ నెటిజన్ కామెంట్ పై… యాంకర్ రష్మీ స్పందించింది. చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు హితువు పలికింది. కుక్క అంతలా దాడి చేస్తుంటే నిద్రపోయారా అని తల్లిదండ్రులపై ఫైర్ అయింది యాంకర్ రష్మీ.

కుక్క దాడి చేసిన సమయంలో ఆ చిన్నారి ఏడుపు వినబడలేదా అని మండిపడింది. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన 100 వీడియోలో నేను షేర్ చేస్తాను అంటూ వచ్చి పోయింది రష్మి. అయితే రష్మి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇస్తున్నారు నేటిజన్స్. 24 గంటలు చిన్నపిల్లలతోనే తల్లిదండ్రులు ఉండాలని… ఆ విషయాన్ని తెలుసుకోవాలని ఫైర్ అవుతున్నారు నేటిజన్స్. మొత్తానికి రష్మీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు