The Warriorr: స్టార్ హీరోలు వద్దనుకుంటే రామ్ చేశాడా?

రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్‌’. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మరో రెండు రోజుల్లో అంటే జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.’ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య గా ఈ చిత్రంలో రామ్ కనిపించబోతున్నాడు.నదియా రామ్ కు తల్లి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం కథ ఏంటి? అన్నది ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఇదే కథని ముందుగా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలకు దర్శకుడు లింగుస్వామి వినిపించినట్టు తెలుస్తుంది.

అవును ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. ముందుగా ‘వారియర్’ కథని మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు వినిపించాడట దర్శకుడు లింగుస్వామి. మహేష్ అయితే ‘ఇది తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అవ్వదు’ అని చెప్పి రిజెక్ట్ చేసాడట. అల్లు అర్జున్ అయితే వేరే చిత్రాలకి కమిట్ అవ్వడం వల్ల లింగుస్వామి కథ చేయలేకపోతున్నట్టు చెప్పి సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. మరి ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన ఈ ‘వారియర్’.. రామ్ కు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు