Dhanush: కోటి విరాళం ప్రకటించిన ధనుష్‌..

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా హీరో ధనుష్కు మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో పుట్టి పెరిగిన హీరో ధనుష్.. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగాడు. హీరోగా, రైటర్ గా, అలాగే గాయకుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు హీరో ధనుష్.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యాను హీరో ధనుష్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం 2004 సంవత్సరంలో అయింది. అప్పటినుంచి ధనుష్ కెరీర్ మరింత పీక్ కు వెళ్ళింది. ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తాజాగా హీరో ధనుష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన బిల్డింగు నిర్మాణం కోసం విరాళాన్ని ప్రకటించాడు. ఏకంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు హీరో ధనుష్. దీనికి సంబంధించిన చెక్ ను… నాజర్కు అందించారు హీరో ధనుష్. అలాగే హీరో కార్తికేయన్ కూడా 50 లక్షల రూపాయలు అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు