Dhanush – Aishwarya Rajinikanth Divorce : విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ధనుష్, ఐశ్వర్య

Dhanush – Aishwarya Rajinikanth Divorce : సౌత్ సినిమా ప్రియులకు షాకిచ్చే ఓ బ్యాడ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. గత కొంత కాలంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా విడిపోవాలనే ఆలోచనతో ఈ జంట పెద్ద అడుగే వేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ విడాకుల కోసం కోట్లు మెట్లు ఎక్కి షాక్ ఇచ్చారు. ఐశ్వర్య రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు అధికారికంగా తమ బంధాన్ని తెంచుకోవడానికి రెడీ అయ్యారు.

విడాకుల పిటిషన్ దాఖలు చేసిన ధనుష్-ఐశ్వర్య

వాస్తవానికి ఈ జంట 2022 జనవరి 27న తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్లిద్దరి అభిమానులు ఈ జంట ఈరోజు కాకపోతే రేపు మళ్లీ ఒకరినొకరు మిస్సయిపోతారని, దూరం తొలగి ఒక్కటవుతారేమోనని ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఈ సెలెబ్రిటీ కపుల్ తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుని షాక్ ఇచ్చారు. విడిపోతున్నట్లు ప్రకటించిన రెండేళ్ల తర్వాత ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను అధికారికంగా దాఖలు చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి విడాకుల కేసు వేయడంతో ఫ్యాన్స్ గుండె బద్దలైనంత పనయ్యింది.

రెండేళ్లుగా ప్రయత్నించినా ఫలితం లేదా?

ధనుష్, ఐశ్వర్య జంట గత రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమ బంధాన్ని పూర్తిగా ముగించాలనే ఆలోచనతో కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా పరస్పర అంగీకారంతో విడిపోవాలని ధనుష్, ఐశ్వర్య నిర్ణయించుకున్నారు. వారి పిటిషన్ ప్రకారం ధనుష్, ఐశ్వర్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయం త్వరలో కోర్టులో విచారణకు రానుంది. అయితే ఈ జంట తమ బంధాన్ని కాపాడుకోవడానికి ఇప్పటి వరకు చాలా ప్రయత్నించారని, కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ పరిస్థితిలో ఏ మార్పూ లేకపోవడంతోనే విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

- Advertisement -

ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ పెళ్లి, పిల్లలు

ధనుష్, ఐశ్వర్య 2004లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ధనుష్ , ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు యాత్ర, లింగ ఉన్నారు. ఒకరు 2006లో, మరొకరు 2010లో జన్మించారు. ఇప్పుడు వాళ్లిద్దరూ పెద్దయ్యారు కూడా. ఇలాంటి టైంలో ధనుష్, ఐశ్వర్య విడిపోతాము అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. మరి విడాకుల తరువాత పిల్లల బాధ్యతను ఎవరు తీసుకుంటారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

ధనుష్ సినిమాల విషయానికొస్తే…

ధనుష్ ప్రస్తుతం రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ లేదా మేలో రాయన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ధనుష్ లైనప్ లో కుబేర, ఇళయరాజా బయోపిక్ కూడా ఉన్నాయి. మరోవైపు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన “లాల్ సలామ్” డిజాస్టర్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు