Chiranjeevi : కూతురి కోసం ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ‘గాడ్ ఫాదర్’ విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కాబోతుంది. ‘భోళా శంకర్’ ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు షూటింగ్ లు పూర్తి చేస్తే కానీ చిరు మరో ప్రాజెక్టు మొదలు పెట్టే అవకాశం లేదు.

అయితే, మెగా స్టార్ మరో ప్రాజెక్ట్ ను చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి థియేటర్స్ లో కాకుండా, డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే, చిరు డిజిటల్ ఎంట్రీ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం చిరంజీవికి ఆ ఉద్దేశం ఉంది అని తెలుస్తుంది.

తన కూతురు సుస్మిత కొణిదెల కోసం గత ఏడాది నుండే డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. సుస్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ ను స్థాపించింది. దీనిపై ‘సేనాపతి’ అనే చిత్రాన్ని నిర్మించింది. దానికి క్రిటిక్స్ నుండి మంచి అప్లాజ్ వచ్చింది. కానీ, ఆ మూవీ జనాల్లోకి ఎక్కువగా వెళ్ళలేదు. దీంతో తన కూతురి సంస్థ కోసం చిరు డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అందుకోసం కథలు కూడా వింటున్నారట. అయితే, అవి చిరుకి నచ్చడం లేదని టాక్. మెగాస్టార్ కు నచ్చిన స్టోరీ వస్తే, డిజిటల్ స్క్రిన్ పై త్వరలోనే చిరంజీవిని చూడచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు