Parineeti Chopra: అప్పుడు మిస్ అయింది ఇప్పుడు ఎంట్రీ ఇస్తుంది

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఈ మధ్యనే లాంఛనంగా ప్రారంభమయ్యాయి.’హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ ‘రెడ్’ చిత్రాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు రామ్. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా పై రామ్ అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. వాళ్ళ దృష్టి అంతా రామ్ తర్వాత చేయబోయే బోయపాటి శ్రీను సినిమా పైనే ఉంది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.

ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి.. పక్క భాషల్లో క్రేజ్ ఉన్న నటీనటులను కూడా ఎంపిక చేసుకోవాలి అని బోయపాటి భావిస్తున్నాడు. విలన్ గా హీరోని పెట్టె అవకాశం ఉంది. అయితే ఏ భాషకు చెందిన పాపులర్ హీరోని పెడతాడు? అన్న విషయం తెలియాల్సి ఉంది. హీరోయిన్ మాత్రం కచ్చితంగా బాలీవుడ్ కు చెందిన హీరోయిన్ అయ్యుండాలి అని భావించి పరిణీతి చోప్రా ని ఫిక్స్ చేశారని వినికిడి. నిజానికి ఈ అమ్మాయి మహేష్ నటించిన స్పైడర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలి. కానీ అప్పుడు మిస్ అయ్యింది. ఇప్పుడు రామ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు