తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రోజుల్లో శ్రీదేవి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ మకుటం లేని మహారాణిలా ఏలింది. శ్రీదేవి కి జాన్వి కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తల్లి తర్వాత సినిమా రంగంలోకి జాన్వి అడుగు పెట్టింది. ఈరోజు జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
జాన్వి కపూర్ ధడక్ అనే మూవీతో 2018లో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటిగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.
ఇక గతంలో అక్షత్ రాజ్ అనే వ్యక్తితో జాన్వి ప్రేమలో ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలను కొట్టిపడేసింది జాన్వి. ఇక తనకి టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్ తో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పలు సందర్భాలలో తెలిపింది. ఇక జాన్వి కపూర్ కి ఖాళీ సమయం దొరికితే జిమ్ చేస్తుందట. అలాగే ఖాళీ సమయాలలో కంటి నిండా నిద్రపోతానని, లేదా అందం పై దృష్టి పెడతానని ఓ సందర్భంలో తెలిపింది.
ఇక జాన్వి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ” ఎన్టీఆర్ 30″ లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈరోజు జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ గా ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఈరోజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే త్వరలోనే ఈమె గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News