Venky 75: బాలయ్య, నాగ్ ఆ విషయాలను ఇంకా మర్చిపోలేదా?

Venky 75:  సీనియర్ హీరో వెంకటేష్ తన సినిమా కెరీర్ లో 74 సినిమాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రీసెంట్ గా “వెంకీ 75” అనే ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కు చిరంజీవితో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యారు. కానీ కింగ్ నాగార్జున, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం గైర్హాజరు అయ్యారు. మరి వీళ్ళు ఈవెంట్ ను స్కిప్ చేయడానికి కారణం ఏంటి? బాలయ్య, నాగ్ ఇంకా ఆ విషయాలను మర్చిపోలేదా?

వెంకటేష్ తాజాగా నటిస్తున్న “సైంధవ్” మూవీతో 75వ చిత్రాన్ని పూర్తి చేసి, ఆయన కెరీర్లో అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా వెంకీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి “సైంధవ్” మేకర్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. “వెంకీ 75” ఈవెంట్ కు టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితో పాటు ఆయనతో కలిసి పని చేసిన దర్శకులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో “వెంకీ 75” ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ఆయనతోపాటు నాని, రానా దగ్గుబాటి, అడవి శేష్, నిఖిల్ సిద్ధార్థ్, శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, బ్రహ్మానందం, అలీ కూడా ఈ స్పెషల్ ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ ఈవెంట్ లో స్టార్ హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్లో కనిపించలేదు. ఎందుకంటే బాలయ్య, నాగార్జున, మహేష్ ఈవెంట్ ను స్కిప్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అందుకే ఆ సమయంలో “వెంకీ 75” ఈవెంట్ కు హాజరు కాలేకపోయాడు. కానీ బాలయ్య, నాగ్ ఈవెంట్లో కనిపించకపోవడంతో పలు కారణాలను వెతుకుతున్నారు నెటిజన్లు.

- Advertisement -

బాలకృష్ణ, చిరంజీవి మధ్య కోల్డ్ వార్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. చిరంజీవికి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా ఇండస్ట్రీ నుంచి అందరూ సెలబ్రిటీలు పాల్గొంటారు ఒక్క బాలయ్య తప్ప. దానికి కారణం ఏంటి అన్న విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. అసలు బాలయ్యే చిరు ఈవెంట్స్ ను కావాలని స్కిప్ చేస్తారా? లేదంటే చిరంజీవి ఆయనను అసలు ఆహ్వానించరా? అనేది సమాధానం లేని ప్రశ్న. ఇక “వెంకీ 75″లో కూడా చిరంజీవి ఉండడం వల్లే బాలకృష్ణ రాలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున విషయానికి వస్తే గతంలో వెంకటేష్ సోదరిని నాగార్జున పెళ్లాడాడు.

కానీ నాగచైతన్య పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. తన సోదరిని నాగార్జున అలా వదిలేయడం వెంకటేష్ కు నచ్చలేదని, అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య మాటలు లేవు అని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా నాగార్జున “వెంకీ 75” వంటి స్పెషల్ ఈవెంట్ ను స్కిప్ చేయడానికి అదే కారణం అని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్లలో బిజీగా ఉన్నారు.

బాలయ్య ప్రస్తుతం బాబి సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్లో ఉన్నారని సమాచారం. ఇక నాగార్జున ఈ సంక్రాంతికి “నా సామి రంగ” మూవీ తో థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండడంతో, వీలైనంత త్వరగా “నా సామి రంగ” మూవీ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగార్జున. అందుకే ఈ ఇద్దరు హీరోలు వెంకటేష్ స్పెషల్ ఈవెంట్ కు రాలేకపోయారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు