మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా , రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “పక్కా కమర్షియల్”. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు.
రీసెంట్ గా విడుదల చేసిన ఈ ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది.
ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు. దర్శకుడు మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి.
తాజాగా “పక్కా కమర్షియల్” సినిమా ఫైనల్ కాపీ చూసిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ దర్శకుడు మారుతి ను , నిర్మాత బన్ని వాసులను అభినందించారు.
ఈ చిత్రానికి జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై1, 2022న నాన్ కమర్షియల్ టికెట్ రేట్స్ తో “పక్కా కమర్షియల్” విడుదల కానుంది.