#Naresh59 : మరో సీరియస్ రోల్

అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్
కానీ ప్రస్తుతం కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేయడంలో కూడా ముందున్నాడు. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు అంటే హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ ఉంటాయని ఆడియన్స్ బలంగా నమ్మేవాళ్ళు. ఆ తరువాత ఒకే పంథాలో సినిమాలు చేయడంతో అల్లరి నరేష్ కి కొంత ఆదరణ తగ్గింది.

ఎట్టకేళ్లకు నాంది సినిమాతో హిట్ కొట్టి తన కెరియర్ కు కొత్త నాంది వేసుకున్నాడు. అప్పట్లో కూడా కేవలం నరేష్ కామెడీ సినిమాలు మాత్రమే చెయ్యలేదు. నేను,ప్రాణం, విశాఖ ఎక్సప్రెస్ వంటి చిత్రాలలో సీరియల్ రోల్స్ కూడా చేసారు. ప్రస్తుతం అల్లరి నరేష్ చేస్తున్న చిత్రం “ఇట్లు మారేడుమిల్లు ప్రజానీకం” A.r. మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
నరేశ్ సరసన నాయికగా ఆనంది అలరించనుంది.

నరేష్ పుట్టినరోజు సంధర్బంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు.
రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మరోసారి ఒక సీరియస్ సబ్జెక్టు తో నరేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్ధమవుతుంది. హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు