అందం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక కొన్ని సంవత్సరాల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వర్య రాజేష్. వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఔరా అనిపించింది. ప్రస్తుతం తమిళనాట స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒకటి రెండు అవకాశాలు వస్తేనే అబ్బో అంటున్నారు ఈరోజుల్లో. అలాంటిది ఏకంగా ఒకేసారి అరడజన్కి పైగా సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఇక ఆ నమ్మకం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
తాజాగా ఈ భామ తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి స్పెషల్ క్రిటిక్ అవార్డు అందుకున్నది. మరోవైపు తమిళనాడు నుంచి బెస్ట్ యాక్ట్రెస్గా సైమా అవార్డు అందుకుంది. ఇక ఈ సారి తెలుగు నుంచి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎక్కువ అవార్డులను కైవసం చేసుకుంది. ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి. ఈమె హాస్య నటి శ్రీలక్ష్మీ మేన కోడలు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి 38 ఏళ్ల వయసులో కన్నుమూసిన నటుడు రాజేష్ కుమార్తె ఐశ్వర్వ రాజేష్.
ఇప్పుడు ఈమె తమిళంలో వరస సినిమాల్లో నటిస్తోంది. కానీ ఒకప్పుడు ఉన్న కష్టాలు తెలిస్తే మాత్రం కన్నీరు పెట్టకుండా ఉండరు. ఓ వైపు వాళ్ల నాన్నతాగుడుకి బానిసై లివర్ చెడిపోయి మరణిస్తే వాళ్ల అమ్మ నానా కష్టాలు ఎదుర్కొంది. ఒక ప్లాట్ అమ్మేసి అప్పులను చెల్లించింది. ఆ తరువాత ఐశ్వర్య రాజేష్ ఒకేసారి ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఇక ఆ తరువాత కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆమె తీసుకుంది. ఇక ఆ సమయంలో సన్ టీవీలో అస్తోపోవధ్ యార్ అనే కామెడీ షోలో యాంకర్గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగారు ఐశ్వర్వ రాజేష్.