Paruchuri Gopala Krishna : భలే కవర్ చేశారు

టాలీవుడ్ లో ప్రముఖ రచయితల్లో పరుచూరి గోపాల కృష్ణ ఒకరు. ఈ పరుచూరి బ్రదర్ గత రెండు, మూడేళ్లుగా ఆడి వెళ్లిపోయిన సినిమాల పై రివ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. కర్ర విరక్కూడదు, పాము చావాలి అనే పద్ధతిలో రివ్యూలు ఇస్తున్నాడు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రంపై పరుచూరి రివ్వూ ఇచ్చాడు. మొదట్లో ఈ చిత్రాన్ని చలి చీమలు, మరో మలుపు వంటి చిత్రాలతో పోల్చాడు. తర్వాత ఈ సినిమాలో చరణ్ ను కాకుండా వేరే చిన్న హీరోను తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. అలాగే సిద్ధ పాత్రను 10 నుండి 15 నిమిషాల్లో ముగించేసి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు.

తర్వాత ఈ సినిమాలో చిరు స్టెప్పులు వేయడం కూడా కరెక్ట్ కాదు అన్నాడు. చిరుకే, 90 శాతం ప్రాముఖ్యత ఉంటే బాగుండేది అని చెప్పుకొచ్చాడు. అంతా బానే ఉంది కానీ చివర్లో ఈ సినిమా కూడా వారం రోజుల్లో కలెక్షన్లు రాబట్టేసి ఉండొచ్చు అని చెప్పాడు. ఓ పక్క ఆచార్య నష్టాలు తీర్చడానికి దర్శకుడు కొరటాల శివ కిందా మీదా పడుతున్నాడు. నిజంగా కలెక్షన్లు వచ్చి ఉంటే కొరటాలకు ఇన్ని తిప్పలు ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, చిరు కుటుంబానికి పరుచూరి ఆస్థాన రచయిత కాబట్టి, ఆచార్యను వెనకేసుకొచ్చినట్టు ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు