Venuswami: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న టాలీవుడ్ స్టార్ హీరో..?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంలోనూ, సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతూ ఉంటారు వేణు స్వామి. అలా చెబుతూ చెబుతూ ఆయన కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయారు. చాలావరకు ఆయన చెప్పిన విషయాలు జరగడంతో ఎక్కువమంది నమ్ముతుంటారు. మరికొంతమంది మాత్రం ఆయన చెప్పేవన్నీ ఉత్తిత్తివే అని కొట్టి పడేస్తుంటారు.

అయితే 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఓ టాలీవుడ్ సూపర్ స్టార్ గురించి ఓ విషయం చెప్పి గట్టి షాక్ ఇచ్చారు. ఓ తెలుగు స్టార్ హీరో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఈ ఏడాదికానీ, వచ్చే ఏడాది కానీ ఆ హీరో సినిమాలకు గుడ్ బై చెబుతారని జాతకం చెప్పారు. అంటే అనారోగ్య కారణాలవల్ల ఆ హీరో సినిమాల నుంచి తప్పుకుంటారని చెప్పారు.

దీంతో ఆ హీరో ఎవరంటూ నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ ని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని.. ఆయన కెరీర్ అయిపోయిందని.. ఆయన సినిమాలు ఏవి ఆడవని వేణు స్వామి ఒకటే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి వేణు స్వామి ఏ హీరోని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు