Trivikram : మళ్లీ అదే తప్పు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోకులంలో సీత తో ఏర్పడిన వీరి పరిచయం 2008లో వచ్చిన జల్సా సినిమాతో స్నేహంగా మారింది. ఆ స్నేహం రోజు రోజుకు బలపడుతూ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. వీరి కాంబోలో ఇప్పటి వరకు జల్సాతో పాటు అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. అలాగే ఇటీవల విడులైన భీమ్లా నాయక్ సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడు. తన సినిమాను పక్కన పెట్టి మరీ పవన్ కోసమే పని చేశాడు.

ఈ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో సినిమాలు లేక దాదాపు రెండున్నర ఏళ్లు అవుతుంది. చివరిగా 2020 జనవరిలో అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో.. సినిమా వచ్చింది. దీని తర్వాత త్రివిక్రమ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB28 రానుంది. ఇప్పటికే షూటింగ్ కావాల్సింది. కానీ నిర్మాతల సమ్మె వల్ల ఆలస్యమవుతుంది. ఈనెల చివరలో షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.

అయితే తాజాగా ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్త ప్రకారం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం పని చేయడానికి సిద్ధమవుతునట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తమిళంలో వచ్చిన వినోదయ సీతంను తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సముథ్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ రీమేక్ పనుల్లోకి త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వ్యవహారలపై త్రివిక్రమ్ దృష్టి పెడుతున్నట్టు టాక్.

- Advertisement -

గతంలో మహేష్ ఖలేజా, పవన్ తీన్ మార్ సినిమాలకు ఒకే సారి ఎలా పని చేశాడో.. ఇప్పుడు SSMB28కు, వినోదయ సీతం రీమేక్ కూడా అలాగే పని చేయాలని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపస్తుంది. దీనిపై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఇలా చేయడం వల్లే ఖలేజా, తీన్ మార్ రెండు విఫలమయ్యాయని, మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు