Samantha : రాజకుమారిగా !

టాలీవుడ్ అగ్ర తార సమంత గురించి తెలియని వారు ఉండరు. ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన సామ్, తన తొలి సినిమాలో హీరోగా న‌టించిన‌ అక్కినేని నాగ చైతన్యను ప్రేమించింది. ఇక ఆ త‌రువాత అత‌న్నే పెళ్లి చేసుకుంది.  దాదాపు ఏడేళ్ల పాటు చెట్టా బుట్ట‌లేసుకొని తిరిగిన ఈ జంట 2017 లో పెళ్లి పీటలెక్కారు.

వీరి పెళ్లి జ‌రిగిన నాలుగేళ్ల‌కే నాగ‌చైతన్య-స‌మంత‌ 2021 లో సంయుక్తంగా డైవర్స్ తీసుకున్నారు. విడాకుల తర్వాత అటు నాగ చైతన్య, ఇటు సమంత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు నాగ చైతన్య. ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టేందకు సిద్ధమవుతుంది.

చాలా రోజుల నుంచి సమంత, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అవి రోజు రోజుకు బలపడుతున్నాయి. వీరు దినేష్ విజన్ నిర్మించే ఓ సినిమాలో నటిస్తున్నారట. దినేష్ విజన్ ఎక్కువగా హారర్ సినిమాలను నిర్మిస్తారు. కాగా వీళ్లు నటంచే సినిమా కూడా హారర్ అని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో సామ్ రాజకుమారి పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా రక్త పిశాచిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు దాదాపుగా ముగిశాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు