ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘యానిమల్’ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో తానేంటో ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ టంగ్ స్లిప్ అయ్యి, సినిమాకు సంబంధించిన ఓ బిగ్ ట్విస్ట్ ని రిలీజ్ చేశాడు. ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్. ‘యానిమల్’ హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్న తెలుగు, హిందీ, భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ, పలు ఎంటర్టైన్మెంట్ షోలలోకి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు.
అందులో భాగంగానే తాజాగా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న బిగ్గెస్ట్ షో “అన్ స్టాపబుల్”కి హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షోలో రణబీర్ కపూర్ అనుకోకుండా ‘యానిమల్’ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ ట్విస్ట్ ని బయట పెట్టేసాడు. షో కొనసాగుతున్న క్రమంలో ఒకానొక సందర్భంలో రష్మికతో ఇదే చివరి సినిమా కదా ?అని బాలయ్య ప్రశ్నించగా, లేదు ‘యానిమల్ పార్ట్ 2’ కూడా ఉంది కదా అని రణబీర్ నోరు జారేసాడు.
దీంతో షాక్ అయిన రష్మిక ఈ విషయం చెప్పడానికి మేకర్స్ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా ? అని అడుగుతుంది.
దీంతో వెంటనే ఫ్లోలో టంగ్ స్లిప్ అయిన రణబీర్ తన స్టేట్మెంట్ ను కవర్ చేసుకుంటూ ‘యానిమల్ 2’ ఉండే అవకాశం ఉంది అని మాత్రమే చెబుతున్నానని క్లారిటీ ఇచ్చాడు. అసలు ఈ సినిమాకు పార్ట్ 2 ఉందనే విషయాన్ని మేకర్స్ ఇప్పటిదాకా ఎక్కడా కూడా రివిల్ చేయలేదు. బహుశా థియేటర్స్ లో ఈ విషయాన్ని ప్రకటించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారేమో.
కానీ రణబీర్ కపూర్ మాత్రం ఇలా టంగ్ స్లిప్ అయ్యి మేకర్స్ కు నిరాశ మిగిల్చాడు.
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా వాళ్ళు మరిన్ని ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి ప్రమోషన్స్ పూర్తయ్యేలోపు రణబీర్ నోరు జారుడుతనం వల్ల మేకర్స్ ఇంకెన్ని తంటాలు పడాల్సి వస్తుందో. ఏదైతేనేం రణబీర్ మాటలతో ‘యానిమల్ పార్ట్ 2’ కూడా ఉండబోతోంది అని ఫిక్స్ అయ్యారు.