RC15: శంకర్ సినమాలో చెర్రి డుయల్ రోల్..?

RRR సినిమా భారి విజయాన్ని ఆశ్వాదించడంలో తారక్-చెర్రి లు బిజీ గా ఉన్నారు. మొన్నీమధ్య చెర్రి ముంబైలో ఒక ధియేటర్ కి వెళ్లి మరీ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో స్వయంగా చూసి వచ్చాడు. ప్రస్తుతం దీక్షలో ఉన్న చెర్రి, “ఆచార్య” పనుల్లో కుడా బిజీ గా ఉన్నాడు. ఏప్రిల్ 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం పై భారి అంచనాలున్నాయి. 

రాం చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ని ప్రముఖ భారి చిత్రాల దర్శకుడు శంకర్ గారితో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే చాల అంచనాలను పెంచేశాయి. రాజమౌళి మాదిరిగానే, శంకర్ కుడా చిత్రానికి సంబధించిన ఏ విషయం బయటకి రానివ్వకుండా  చాల జాగ్రత్తపడతారు. తద్వారా చిత్రం మీద ఉత్కంఠని రేకేత్తిస్తారు. 

ఇదిలా ఉండగా, ఇటివల ఈ చిత్రానికి సంబంధిచిన ఒక పూకారు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో చెర్రి ద్విపాత్రాభినయం చేయ్యబోతున్నట్టు, ఒకరేమో ముసలి రాజకీయ నాయకునిగా, మరొకరేమో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని ఆ పూకర్ల సారంశం. 

- Advertisement -

ఇప్పటి వరకు ఇటువంటి వయసుమళ్ళిన పాత్రలు చెయ్యని చరణ్, ఇప్పుడు ఎలా చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు