Keerthy Suresh is the heroine who rejected the role
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. తమిళ్ లో అజిత్ నటించిన వేదాళం అనే సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, రఘు బాబు, గెటప్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్, ఆమె భర్తగా యంగ్ హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు. అయితే చిరంజీవి చెల్లి పాత్ర కోసం మెహర్ రమేష్ మొదట అనుకున్నది కీర్తి సురేష్ ని కాదట.
ఈ పాత్ర కోసం మొదట సాయి పల్లవి ని అనుకున్నారట. ఈ కథని కూడా సాయి పల్లవికి వివరించారట. కానీ ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి స్వయంగా వెల్లడించింది. ఈ విషయం తెలియడంతో మంచి అవకాశాన్ని విష్ చేసిందని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News