అలనాటి అందాల హీరోయిన్ రాధా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె సీనియర్ హీరోలు అందరితోనూ కలిసి నటించారు. ప్రస్తుతం కొన్ని సినిమాలలో ఆమె క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఇక ఈమె కూతురే కార్తిక నాయర్. ఈమె 17 ఏళ్లకే జోష్ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో విద్య అనే స్కూల్ టీచర్ పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత తమిళ్ లో ‘కో’ (తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా ఈ బ్యూటికి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఆ తరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ అనుకున్నంత గుర్తింపు, ఆఫర్లు దక్కలేదు. ఆ తరువాత మళ్లీ తెలుగు పరిశ్రమలోనే దమ్ము చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఈ చిత్రం తర్వాత అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన బ్రదర్స్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో అదరగొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె మరే తెలుగు చిత్రంలోను నటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరమై తన ఫ్యామిలీకి ఉన్న హోటల్స్, బిజినెస్ చూసుకుంటుంది.
దుబాయిలో తమ బిజినెస్ ని మరింత విస్తరించి పలు అవార్డులు కూడా అందుకుంది. అయితే తాజాగా కార్తిక నాయర్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తుంటే ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అర్థమవుతుంది.
ఈ ఫోటోలో ఓ అబ్బాయిని కౌగిలించుకొని, చేతికి ఉన్న రింగ్ చూపించింది. దీంతో కార్తిక రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ అబ్బాయి ఎవరో మాత్రం ఫోటోలో ఈ బ్యూటీ చూపించలేదు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News